భద్రాద్రి కొత్తగూడెం, మే 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి తునికాకు కార్మికులకు ప్రభుత్వం రూ. 900 కోట్ల బోనస్ ఇస్తున్నట్టు అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నా రు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్ముగూడెం మండలం ములకపాడు, పినపాక నియోజకవర్గంలోని కరకగూడెం మండల కేంద్రానికి చెందిన తునికాకు కార్మికులకు ములకపాడులో బోనస్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2016 నుంచి ఇప్పటి వరకు రా వాల్సిన బోనస్ అంతా ఒకేసారి ఇస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా భద్రా ద్రి జిల్లాకు రూ.80 కోట్లు మంజూరయ్యాయ ని తెలిపారు. భద్రాచలం నియోజకవర్గానికి చెందిన కార్మికులకు రూ. 27.56 కోట్లు, పినపాక నియోజకవర్గానికి చెందిన విలువైన రూ.33.60 కోట్ల చెక్కులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు.
గిరిజను లు అడవిని నమ్ముకొని జీవిస్తూ.. తల్లిలా కాపాడుతున్నారని కొనియాడారు. గతం లో తునికాకు బోనస్ గురించి ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదని, కానీ.. సీఎం కేసీఆర్ గిరిజనుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పీసీసీఎఫ్ డోబ్రియాల్, కలెక్టర్ అనుదీప్, ఐటీడీఏ పీవో గౌతమ్ పాల్గొన్నారు.