హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద హైదరాబాద్కు చెందిన శ్రీ వెంకటేశ్వర ఇండస్ట్రీస్కు చెందిన రూ.90 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సీజ్ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా శ్రీ వెంకటేశ్వర పరిశ్రమ వ్యర్థాలను విడుదల చేస్తున్నదని తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఈడీ రంగంలోకి దిగి చర్యలు చేపట్టింది. దీనిపై విచారణ కొనసాగిస్తున్నట్టు తెలిపింది.