నిజామాబాద్: నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో ఘోరం జరిగింది. 35 ఏండ్ల వ్యక్తి నిండా పదేండ్లు కూడా నిండని చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ నెల 22న నారాయణ అనే వ్యక్తి 9 ఏండ్ల చిన్నారికి పండ్ల రసం ఇప్పిస్తానని తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. అనంతరం బాలిక తనపై జరిగిన దారుణాన్ని తన తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నారాయణపై పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు పంపించారు.