హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో నమోదైన 9 గుర్తింపు లేని రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం రద్దు చేసినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్రెడ్డి వెల్లడించారు. వాటిలో ఆలిండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ, ఆలిండియా బీసీ ఓబీసీ పార్టీ, బీసీ భారతదేశం పార్టీ, భారత్ లేబర్ ప్రజాపార్టీ, లోక్సత్తా పార్టీ, మహాజన మండలి పార్టీ, నవభారత్ నేషనల్ పార్టీ, తెలంగాణ ప్రగతి సమితి, తెలంగాణ ఇండిపెండెంట్ పార్టీ ఉన్నట్టు తెలిపారు.
చట్టపరమైన నిబంధనలు పాటించకపోవడంతో ఈ పార్టీలను డిలిస్టింగ్ చేసినట్టు చెప్పారు. ఇవన్నీ రిజిస్టర్డ్ పార్టీలే అయినప్పటికీ గుర్తింపు పొందలేదని, ప్రజాస్వామ్య ప్రతినిధుల చట్టం-1951 ప్రకారం తప్పనిసరి నివేదికలు, లెకలు సమర్పించకపోవడంతో ఎన్నికల సంఘం వాటిని రద్దు చేసిందని వివరించారు. రద్దయిన పార్టీల్లో 4 హైదరాబాద్కు, మరో 4 నాలుగు మేడ్చల్-మలాజిగిరి జిల్లాకు, ఒకటి భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాకు చెందినవి ఉన్నట్టు తెలిపారు.