బొడ్రాయిబజార్: సూర్యాపేట జిల్లా కేంద్రంలో రూ.9 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టబోతున్నారు. పట్టణం తో పాటు శివారు వార్డుల్లో మౌలిక వసతులు కల్పించబోతున్నారు. పట్టణంలోని 48 వార్డుల్లో రూ.8 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు, మురికి కాలువలు, కల్వర్టుల నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అలాగే రూ.50 లక్షల వ్యయం తో సద్దుల చెరువు ప్రక్కన 5 ఎకరాల్లో ఎరీనా పార్కు, మరో 50లక్షలతో చెరువు నడుమన పైలాన్ ఏర్పాటు చేయను న్నారు. ఈ మేరకు నేడు మున్సిపల్ సమావేశంలో పనులను ఆమోదించనున్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ఏడున్నరేండ్లలో మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి చొరవతో ఎనలేని అభివృద్ధి జరుగుతోంది. వందలాది కోట్లు వెచ్చించి చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజల కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నాయి. పట్టణంలో దాదాపు 99శాతం సీసీ రోడ్లు, మురికి కాలువలు, కల్వర్టుల నిర్మాణాలు, పార్కులు, రోడ్ల మద్యన పచ్చని డివైడర్లు ఇలా అనేక పనులు చేపట్టగా తాజాగా అక్కడ మిగిలిపోయిన పనులతో పాటు శివారు ప్రాంతాల అభివృద్ధి కోసం మున్సిపల్ సాధారణ నిధులతో చర్యలు చేపడుతున్నారు.
రూ.8 కోట్ల వ్యయంతో పట్టణంలో 88 చోట్ల సీసీ రోడ్లు, మురికి కాలువల పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిం చారు. అంతేకాకుండా సద్దుల చెరువు సమీపంలో ఉన్న 5ఎకరాల స్థలంలో ఎరీనా పార్కు ఏర్పాటుకు మరో రూ.50 లక్ష లు, చెరువు మధ్య రూ.50లక్షలతో ఫైలాన్ ఏర్పాటు చేయనున్నారు. మొత్తం మీద గడిచిన ఏడున్నరేండ్లలో మంత్రి చొర వతో కోట్లాది రూపాయలు వెచ్చించి కనీవినీ ఎరుగుని రీతిన అభివృద్ధి పనులు, సుందరీకరణ, పచ్చదనం ఉట్టిపడేలా కార్యక్రమాలు చేపట్టగా తాజాగా తొమ్మిది కోట్లతో చేపట్టబోయే పనులతో సూర్యాపేట మరింత సుందరంగా మారనుంది.