కవాడిగూడ, జనవరి 24: హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి 88వ పుట్టినరోజు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. కోటి ప్రత్యాంగిరా మహాయాగంలో భాగంగా నాలుగోరోజైన బుధవారం జరిగిన పుట్టినరో జు వేడుకలకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరై స్వామివారికి శుభాకాంక్షలు అందజేశారు.
ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రమ్యానంద భారతిస్వామి, పీఠం కో-ఆర్డినేటర్ మునిపెల్లి శ్రీనివాస్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మోచర్ల శశిభూషణ్ తదితరులు పాల్గొన్నారు.