హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): వ్యవసాయానికి ఉచిత కరెంటు సరఫరా, మిషన్ భగీరథ, జలమండలి ద్వారా తాగునీటి సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ నెలకు విద్యుత్తు సబ్సిడీ కింద రూ.875 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్శర్మ ఉత్తర్వులు జారీచేశారు.