కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేటలో (Aswaraopeta) అగ్నిప్రమాదం జరిగింది. అశ్వరావుపేటలోని వడ్డెర బజారులో ఉన్న ఓ గుడిసెలో ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు కొవ్వొత్తి అంటుకున్నది. మంటలు చెలరేగడంతో అందులో ఉన్న వృద్ధుడు సజీవదహనం అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడిని పెద్దభిక్షం (80)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.