Free Bus | నీలగిరి, డిసెంబర్ 12 : ఫ్రీ బస్సు అని ఎక్కితే 8 తులాల బంగారం చోరీ జరిగిందని బాధితురాలు ఆందోళన వ్యక్తం చేసింది. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడకు చెందిన చిమ ట స్వప్న మంగళవారం ఉదయం నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం జోగువారి గూ డెంలోని తమ బంధువుల ఇంట్లో జరిగే వివాహానికి బయలుదేరింది. నార్కట్పల్లి నుంచి నల్లగొండకు వస్తుండగా ఆర్టీసీ బస్సులో రద్దీ అధికంగా ఉండటంతో బ్యాగు కింద పెట్టింది.
నల్లగొండకు రాగానే కిందకు దిగే క్రమంలో బ్యాగు జిప్ తీసి ఉండటంతో అనుమానం వచ్చి చూడగా అందులో ఉన్న బంగారం కన్పించలేదు. తన భర్త శ్రీనివాస్తో కలిసి ఎప్పుడైనా నాన్స్టాప్ బస్సుకే వచ్చేవారమని, మహిళలకు ఫ్రీ బస్సు పెట్టడంతో హైదరాబాద్ నుంచి నార్కట్పల్లికి సూర్యాపేట డి పోకు చెందిన ఎక్స్ప్రెస్కు వ చ్చి, నార్కట్పల్లి నుంచి నల్లగొండకు మరో బస్సులో వస్తున్న క్రమంలో చోరీ జరిగిందని బాధితురాలు పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు నల్లగొండ టూటౌన్ ఎస్సై నాగరాజు తెలిపారు.