కరీంనగర్ కమాన్చౌరస్తా, ఫిబ్రవరి 16 : పదోతరగతి విద్యార్థుల అల్పాహారానికి రైస్ మిల్లర్స్ అసోసియేషన్, జమ్మికుంట ఎస్ఆరే డెయిరీ బాధ్యులు చేయూతనందించారు. పదోతరగతి వార్షిక పరీక్షల్లో ఉతీర్ణత సాధించే దిశగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతోపాటు సాయంత్రం అల్పాహారాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రూ.5 లక్షల చెక్కు, ఎస్ఆర్కే డెయిరీ జమ్మికుంట ఆధ్వర్యంలో రూ.3 లక్షల విరాళం చెకును శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో కలెక్టర్ పమేలా సత్పతికి అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీ కిరణ్, జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ సభ్యులు నర్సింగారావు, ప్రభాకర్రావు, ఆనందరెడ్డి, రాజమౌళి, గిరిధర్, కేశవరెడ్డి, ఎస్ఆర్కే డెయిరీ జమ్మికుంట సభ్యులు పాల్గొన్నారు.