నల్లగొండ: జిల్లాలోని నిడమనూరు (Nidamanuru) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని ముకుందాపురం వద్ద ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా దవాఖానకు తరలించారు.
వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. దామరచర్ల మండలం కొండ్రపోలులో పెండ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉన్నది.