హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): ‘రాష్ట్రంలో విద్య ప్రైవేటీకరణను ప్రభు త్వం ప్రోత్సహిస్తున్నది. పెద్ద ఎత్తున ప్రైవేట్ బడులకు అనుమతులిస్తున్నది’ ఇది కొం దరి ఆరోపణ. కానీ, ఇది ఏ మాత్రం వాస్తవం కాదని 2021-22 సామాజిక, ఆర్థిక సర్వేలో వెల్లడయ్యింది. రాష్ట్రంలోని మొత్తం పాఠశాలల్లో 71 శాతం ప్రభుత్వ పాఠశాలలే ఉన్నట్టు సర్వే తెలిపింది. రాష్ట్రం లో ప్రైవేట్ బడులు 26 శాతమే ఉన్నట్టుగా తేల్చింది. ఈ లెక్కన రాష్ట్రంలో ప్రభుత్వం సర్కారు బడులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని అర్థమవుతున్నది.
గ్రేట ర్ హైదరాబాద్ తప్ప రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రైవేట్ బడుల కంటే ప్రభుత్వ బడులే అధికంగా ఉన్నాయి. ప్రైవేట్ బడులు పట్టణప్రాంతాల్లో మాత్రమే ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ బడులే పిల్లలకు చదువునందిస్తున్నా యి. కరోనాతో ఇటీవలి కాలంలో ప్రైవేట్ బడుల్లో ప్రవేశాలు 2శాతం తగ్గగా, ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు 2శాతం పెరిగాయి.