Bhadrachalam | భద్రాద్రి కొత్తగూడెం : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భద్రాచలంలోని కూనవరం రహదారిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కూనవరం నుంచి భద్రాచలం వైపునకు కారులో తరలిస్తున్న రూ. 7.23 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నగదును సీజ్ చేశారు.