గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ స్టోన్ క్రషర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఏడు అంబులెన్స్లను బుధవారం ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు అందజేశారు. రూ.1.55 కోట్ల విలువ గల ఈ అంబులెన్స్లను హైదరాబాద్లోని ప్రగతి భవన్లో కేటీఆర్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్, అసోసియేషన్ అధ్యక్షుడు కమలాకర్రెడ్డి, సభ్యులు పర్వతనేని రమేశ్, నాయకులు బోగ ప్రవీణ్, అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. – జగిత్యాల రూరల్