కార్గో సర్వీసుల ఆదాయం 75.15 కోట్లు
హైదరాబాద్, మార్చి 7: టీఎస్ఆర్టీసీ నడుపుతున్న బస్సుల్లో 68 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే సేవలందిస్తున్నాయని ఆర్థిక సర్వే తెలిపింది. టీఎస్ఆర్టీసీ మొత్తం 9,675 బస్సులు నడుపుతున్నది. వీటిలో ఆర్టీసీ సొంత బస్సులు 6,631, అద్దె బస్సులు 3,044 ఉన్నాయి. ఆర్టీసీకి 97 బస్ డిపోలు, 21 డివిజన్లు ఉన్నాయి. మొత్తం 47,592 మంది ఉద్యోగులు ఆర్టీసీలో పనిచేస్తున్నారు. రోజుకు దాదాపు 54.52 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నట్టు నివేదిక వెల్లడించింది. 2021 నవంబర్ 30 వరకు టీఎస్ఆర్టీసీకి కార్గో సేవల ద్వారా రూ.75.15 కోట్లు ఆదాయం వచ్చింది. మొత్తం 52.51 లక్షల పార్సిళ్లను కార్గో చేరవేసినట్టు పేర్కొన్నది.