Bibinagar AIIMS | హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): బీబీనగర్ ఎయిమ్స్పై కేంద్రం వివక్ష కొనసాగుతూనే ఉన్నది. ఈ వైద్యవిద్యాసంస్థలో 64% నాన్టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. తరగతులు ప్రారంభమైన నాలుగేండ్ల తర్వాత కూడా ఇంకా 40% టీచింగ్ సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నట్టు పేర్కొన్నది. 20 ఎయిమ్స్ల్లో బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీల వివరాలు ఇవ్వాలంటూ ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర వైద్యారోగ్య శాఖ సమాధానం ఇచ్చింది.
ఎయిమ్స్కు నాన్టీచింగ్ స్టాఫ్ మొత్తం 921 మంజూరు చేయగా, కేవలం 351 మందే పని చేస్తున్నారని తెలిపింది. 183 టీచింగ్ పోస్టులను మంజూరు చేయగా, ఇప్పటివరకు 108 మందిని భర్తీ చేసిన ట్టు చెప్పింది. అంటే ప్రతి 3 పోస్టుల్లో ఒకటి ఖాళీగా ఉన్నది. దేశవ్యాప్తంగా పరిశీలించినా తమిళనాడులోని మధురై ఎయిమ్స్ మినహా మిగతా 19 సంస్థల్లో దండిగా నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ప్రతి కాలేజీలోనూ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గొప్పగా చెప్పుకునే ఢిల్లీ ఎయిమ్స్లోనూ సుమారు 30 శాతం పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.