హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): హవాలా దందా గుట్టు రట్టయింది. భారీ నగదును తరలించే క్రమం లో ఐదుగురు ముఠా సభ్యులను సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.63.50 లక్షల నగదును సీజ్ చేశారు. టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు వివరాల ప్రకారం..హైదరాబాద్ గౌలిగూడకు చెందిన కాంతిలాల్.. ట్రూప్బజార్లో రంజా మార్కెటింగ్ పేరుతో గోడౌన్ నిర్వహిస్తున్నాడు.
జోగ్సింగ్ అనే ప్రధాన హహలా నిర్వాహకుడి ఆదేశాలతో అతడు సబ్ ఆపరేటర్గా హైదరాబాద్లో హవాలా దందా నిర్వహిస్తున్నాడు. కిశోర్సింగ్, పెప్ సింగ్, మహ్మద్ అబ్దుల్ ఫరీద్, సందీప్ సింగ్తో ఒక ముఠాను ఏర్పాటు చేశాడు. ఫరీద్, సందీప్ సింగ్ తమ కస్టమర్ల నుంచి రూ.42 లక్షలను, కిశోర్సింగ్, ఫీల్ఖాన్కు చెందిన దిలీప్ అనే వ్యక్తి నుంచి రూ.21.5 లక్షలను తీసుకొని కాంతిలాల్కు అప్పగించారు. ఈ జోగ్సింగ్ ఆదేశాలతో ఈ డబ్బును హవాలా ద్వారా ఇతరులకు తరలించాల్సి ఉన్నది. సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు హవాలా సొమ్మును తరలించే ముఠాను పట్టుకొన్నారు.