సంగారెడ్డి మార్చి 8 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్కు కేంద్ర విద్యాశాఖ రూ.60 కోట్ల గ్రాంట్ను శుక్రవారం విడుదల చేసింది. ఈ నిధులతో ఐఐటీ హైదరాబాద్లో సెంటర్ ఫర్ ఇన్-సిటు అండ్ కోరిలేటివ్ మైక్రోస్కోపీ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. భౌతిక, రసాయన, జీవశాస్ర్తాలు, ఔషధ అధ్యయనాలకు మైక్రోస్కోపీ సెంటర్ ఉపయోగపడనున్నది. పరిశ్రమలకు అవసరమైన పరిశోధనలకు ఐఐటీ హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్న కోరిలేటివ్ మైక్రోస్కోపీ మరింత ఊతం ఇవ్వనున్నది.