పంపిణీ చేసిన యశోద ఫౌండేషన్
హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): యశోద హాస్పిటల్స్ గ్రూప్లో భాగమైన యశోద చారిటబుల్ ఫౌండేషన్ కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా తనవంతుగా ఆదివాసీలకు 6 వేల మాస్కులను పంపిణీచేసింది. గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణీ మండలంలోని మాంగి, పంగిడిమదర, రోంపల్లి, గుండాల, గుడిపేట గ్రామాల్లో స్థానిక పోలీసుల ద్వారా మాస్కులను అందజేసింది. సిరిసిల్ల మహిళా స్వయం సహాయక బృందాలతో ఈ 6 వేల క్లాత్ మాస్కులను తయారుచేయించారు. మహిళల ఆర్థికాభివృద్ధికి కూడా తోడ్పాటునివ్వడం చాలా సంతోషంగా ఉన్నదని యశోద హాస్పిటల్స్ డైరెక్టర్లు డాక్టర్ అభినవ్ గోరుకంటి, డాక్టర్ పవన్ గోరుకంటి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కరోనా కట్టడిలో మాస్క్ ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పారు. టీకాలు వేసుకున్న తరువాత కూడా ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాలని సూచించారు. ఆదివాసీలకు మాస్కుల పంపిణీకి సహకరించిన పోలీసులకు, మహిళా స్వయం సహాయక సంఘాలకు వారు కృతజ్ఞతలు తెలిపారు.