హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ) : తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతున్నదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. గురువారం రికార్డుస్థాయిలో రూ.3.39 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్టు చెప్పారు.
శ్రీవారిని 61,087 మంది భక్తులు దర్శించుకోగా, 30,271 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని వివరించారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేలా శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని పేర్కొన్నారు. ఈ నెల 25 నుంచి 29 వరకు హనుమజ్జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు.