కరీంనగర్: కరీంనగర్లో (Karimnagar) భారీగా నగదు పట్టుబడింది. పట్టణంలోని ప్రతిమ హోటల్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు.. రూ.6.67 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడంతో డబ్బును సీజ్ చేశామని ఏసీపీ నరేందర్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొమ్మును కోర్టులో డిపాజిట్ చేస్తామని వెల్లడించారు.