హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొలువుల భర్తీ ప్రక్రియ ఊపందుకున్నది. ఇప్పటికే గ్రూప్-1, పోలీసు, ఇతర ఉద్యోగాల భర్తీ కొనసాగుతుండగా, తాజాగా మరో నోటిఫికేషన్ విడుదలైంది. భూగర్భ జల వనరులశాఖలో 57 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో 32 గెజిటెడ్, 25 నాన్ గెజిటెడ్ పోస్టులున్నాయి. గెజిటెడ్ పోస్టులకు అభ్యర్థులు డిసెంబర్ 6 నుంచి 27 వరకు, నాన్ గెజిటెడ్ పోస్టులకు డిసెంబర్ 7 నుంచి 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్ తెలిపారు. వివరాలకు https://www.tspsc.gov.in చూడాలని సూచించారు. అప్లికేషన్ ఫీజు రూ.200, నాన్ గెజిటెడ్ పోస్టులకు పరీక్ష ఫీజు రూ.80, గెజిటెడ్ పోస్టులకు రూ.120 చెల్లించాలని వెల్లడించారు. ఈ పోస్టులను రాత పరీక్ష ద్వారా భర్తీచేస్తారు. 2023 మార్చి లేదా ఏప్రిల్ మాసాల్లో పరీక్ష నిర్వహించే అవకాశమున్నది. అబ్జెక్టివ్ టైప్లో కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ లేదా ఓఎమ్మార్ తరహా ఎగ్జామ్ నిర్వహించాలా అనేది త్వరలోనే వెల్లడిస్తారు.
అర్హతలిలా..
అర్హతలిలా..