హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్టోబర్ 9 నుంచి నవంబర్ 13 వరకు తెలంగాణవ్యాప్తంగా రూ.552.73 కోట్ల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆదివారం నుంచి సోమవారం వరకు రూ.3.70 కోట్ల విలువైన మద్యం, డబ్బులు, బంగారం, డ్రగ్స్ పట్టుకొన్నారు. ఇప్ప టికీ రూ.188.53 కోట్ల నగదు, రూ.83.16 కోట్ల విలువైన మద్యం, రూ.31.24 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.178.96 కోట్ల బంగారు ఆభరణాలు, రూ.69.68 కోట్ల విలువైన ఉచితాలను సీజ్ చేశారు.