జనగామ: కొనుగోలు కేంద్రంలో ఉన్న వడ్ల బస్తాలు మాయమైన ఘటన జనగామ (Jangaon) జిల్లాలోని తరిగొప్పుల మండలంలో చోటుచేసుకున్నది. మండలంలోని బొంతగట్టునాగారంలో కాంటాకు పెట్టిన 54 వరి బస్తాలను దుండగులు ఎత్తుకెళ్లారు. జంపులు అనే రైతు శనివారం తన వడ్లను కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి కాంటా వేయించాడు.
అయితే వడ్లను తరలించడానికి లారీ ఆలస్యం కావడంతో బస్తాలను అక్కడే ఉంచి వెళ్లిపోయాడు. ఆదివారం ఉదయం వచ్చి చూడగా 54 వడ్ల బస్తాలు కనిపించకుండా పోయాయి. దీంతో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు.