హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): ఫలితాలు.. అడ్మిషన్లు ఏదీ తీసుకొన్నా అన్నింటా అమ్మాయిలదే హవా. తాజాగా ఈ వరుసలో డిగ్రీ అడ్మిషన్లు చేరాయి. ఈ ఏడాది డిగ్రీ ఫస్టియర్లో 52శాతం అమ్మాయిలు అడ్మిషన్లు పొందారు. ఈ ఏడాది డిగ్రీ ఫస్టియర్లో 2,04,674 మంది విద్యార్థులు చేరగా, అమ్మాయిలు 1,08,150, అబ్బాయిలు 96,524 చొప్పున ప్రవేశాలు పొందారు. డిగ్రీ చదివేందుకు ఇప్పుడు పక్క రాష్ర్టాల విద్యార్థులిప్పుడు తెలంగాణకు క్యూ కడుతున్నారు.
సరిహద్దులు దాటుకొని మన రాష్ట్రంలోనే ప్రవేశాలు పొందుతున్నారు. ఇలా ఈ ఏడాది ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు మన రాష్ట్రంలో డిగ్రీ ఫస్టియర్లో ప్రవేశాలు పొందారు. యాజమాన్యాల వారీగా సీట్ల భర్తీని పరిశీలిస్తే.. ప్రభుత్వ కాలేజీల్లోనే అధికంగా సీట్లు భర్తీ అయ్యాయి. ఇటీవలే డిగ్రీ ఫస్టియర్ అడ్మిషన్ల ప్రక్రియ ముగియగా, ఆయా వివరాలను ఉన్నత విద్యామండలి (చైర్మన్) ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి శుక్రవారం విడుదల చేశారు. ఆయా వివరాలిలా ఉన్నాయి.