హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): ఈ నెల 16న నాగర్కర్నూల్ జిల్లాలో 507 ఎంసీహెచ్ కిట్లు అందుబాటులో ఉన్నట్టు టీఎస్ఎంఎస్ఐడీసీ తెలిపింది. ‘పేరు మార్పు సరే.. కిట్ల సరఫరా ఏది?’ అనే శీర్షికతో ఈ నెల 16న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనంపై సంస్థ స్పందించింది. జిల్లాలో నెలకు సుమారు 1000 కిట్లు అవసరం కాగా, 500 కిట్లే అందుబాటులో ఉన్నాయని కథనంలో పేర్కొనగా.. 507 కిట్లు అందుబాటులో ఉన్నట్టు డీఎంహెచ్వో నివేదిక ఇచ్చినట్టు సంస్థ వెల్లడించింది. పలు పీహెచ్సీల్లో ఒక్క కిట్ కూడా లేదన్న ఆరోపణలను ఖండించింది. బిజినేపల్లి పీహెచ్సీలో 10, బొప్పల్లిలో 45, కోడేరులో 24, వగ్నూర్లో 8, వెల్దండలో 7, వెన్నచెర్లలో 15 కిట్లు అందుబాటులో ఉన్నట్టు వివరించింది. అవసరమైతే పీహెచ్సీలకు పంపిణీ చేసేందుకు జిల్లా దవాఖానలో 78 కిట్లు అందుబాటులో ఉన్నట్టు తెలిపింది.