ఆదిలాబాద్ రూరల్ : చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించింది ఓ మహిళ. ఆదిలాబాద్ రూరల్ మండలం రామాయి గ్రామానికి చెందిన శ్రీరామోజీ రేఖా ప్రభాకర్ తన 50వ ఏట ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల గెజిటెడ్ నంబర్-2లో బుధవారం ఓపెన్ పదో తరగతి పరీక్ష రాసింది. సాధారణ విద్యార్థినిలా ఆమె పరీక్షకు రావడంతో అక్కడివారంతా ఆశ్చర్యానికి గురయ్యారు.