గరిడేపల్లి, ఫిబ్రవరి 15 : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని విరాళాలు అందజేసేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రం తుంబాయిగడ్డలోని ఎంపీపీఎస్, జడ్పీహెచ్ఎస్కు స్థానిక ఎంపీటీసీ సభ్యులు కడియం స్వప్నావెంకటరెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం రూ.50 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఎంపీపీఎస్లో మౌలిక వసతులను కల్పనకు రూ. 25 వేలు, జడ్పీహెచ్ఎస్లో హిందీ బోధించేందుకు వలంటీ ర్ నియామకం కోసం రూ.25 వేలు అందించారు.