హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): రెండో పీఆర్సీలో భాగంగా 50 శాతం ఫిట్మెంట్ను ప్రకటించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) కోరింది. ఎస్జీటీ, సెకండరీ గ్రేడ్లకు మధ్యగల వేతన వ్యత్యాసాన్ని సవరించాలని విజ్ఞప్తి చేసింది. తపస్ ప్రతినిధి బృందం సోమవారం పీఆర్సీ కమిటీ చైర్మన్ శివశంకర్ను కలిసి ప్రతిపాదనలు సమర్పించింది.
తపస్ అధ్యక్షప్రధాన కార్యదర్శులు హనుమంతరావు, నవాత్ సురేశ్, అదనపు ప్రధాన కార్యదర్శి పెంటయ్య, భాస్కర్ దేశ్ తదితరులు ప్రతిపాదనలు సమర్పించిన వారిలో ఉన్నారు.