హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): వచ్చే నెలలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు అందుబాటులోకి రానున్నాయని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్పారు. విజయవాడ రూట్లో వాటిని నడిపిస్తామని తెలిపారు. హైదరాబాద్లోని బస్భవన్ ప్రాంగణంలో సోమవారం కొత్త ప్రోటో (నమూనా) ఎలక్ట్రిక్ ఏసీ బస్సును ఆయన పరిశీలించారు.
బస్సులోని సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. పర్యావరణహిత ఎలక్ట్రిక్ బస్సులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ వీ రవిందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు వినోద్కుమార్, మునిశేఖర్, చీఫ్ మెకానికల్ ఇంజినీర్ రఘునాథరావు, చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ (సీటీఎం) జీవన్ప్రసాద్తోపాటు ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ ఏజీఎంలు వేణుగోపాల్రావు, ఆనంద్బసోలి తదితరులు పాల్గొన్నారు.