వర్ని, మార్చి 23: తాము బ్యాంకులో జమ చేసుకున్న నగదును కాజేశారని ఆరోపిస్తూ నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలోని కెనరా బ్యాంకు ఎదుట 50 మంది ఖాతాదారులు గురువారం ఆందోళనకు దిగారు. బ్యాంకు గేటుకు తాళం వేసి సుమారు రెండు గంటలపాటు బైఠాయించారు. తమకు న్యాయం చేయాలని మేనేజర్ సునీల్కుమార్ను నిలదీశారు. బ్యాంకు ఆదర్శ ఏజెంట్ శ్రీనివాస్తో కుమ్మక్కై సుమారు రూ.20 లక్షలు కాజేశారంటూ వారు ఆందోళనకు దిగారు.
ఈ విషయమై రెండు నెలల క్రితమే మేనేజర్కు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఏజెంట్ను అదుపులోకి తీసుకోలేదని, ఆయనతో మేనేజర్ కుమ్మక్కై డబ్బు కాజేశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకూ బ్యాంకు లావాదేవీలు జరగనివ్వబోమని తేల్చిచెప్పారు. ఎస్సై అనిల్రెడ్డి వచ్చి ఖాతాదారులకు నచ్చజెప్పారు. సోమవారం లో పు నిందితుడిపై కేసు నమోదు చేయిం చి, ఉన్నతాధికారులతో విచారణ చేయిస్తామని మేనేజర్ హామీ ఇవ్వడంతో ఖా తాదారులు ఆందోళన విరమించారు.