Siddipet | సిద్దిపేట జిల్లాలో విషాదం నెలకొంది. వీకెండ్ కావడంతో పర్యటనకు వచ్చి కొండ పోచమ్మ సాగర్ జలాశయంలో పడి ఐదుగురు యువకులు దుర్మరణం చెందారు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్లోని ముషీరాబాద్కు చెందిన ఏడుగురు యువకులు ఇవాళ ఉదయం కొండపోచమ్మ సాగర్ చూసేందుకు వచ్చారు. ఈ క్రమంలో వాళ్లందరూ డ్యామ్లో పడి గల్లంతయ్యారు. ఇది గమనించిన స్థానికులు వారిని రక్షించే ప్రయత్నాలు చేశారు. కానీ అప్పటికే ఐదుగురు యువకులు మరణించారు. మిగిలిన ఇద్దరిని సురక్షితంగా కాపాడగలిగారు. మృతులను ధనుష్, లోహిత్, దినేశ్వర్, సాహిల్, జనిత్గా గుర్తించారు.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
కొండపోచమ్మ సాగర్లో సెల్ఫీ కోసం ఏడుగురు దిగగా మునిగి ఐదుగురు యువకుల మృతి
హైదరాబాద్ ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన వారని సమాచారం
మొత్తం ఏడుగురు గల్లంతు కాగా బయటపడ్డ ఇద్దరు
కొండపోచమ్మ రిజర్వాయర్లో చనిపోయిన ఐదుగురు యువకుల వివరాలు
1. దనుష్ s/o నర్సింగ్,… pic.twitter.com/5x2XfXie7U
— Telugu Scribe (@TeluguScribe) January 11, 2025