JEE Advanced | హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 6 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ఐఐటీల్లో బీటెక్ ప్రవేశాల కోసం ఈ నెల 4న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఆన్లైన్ పరీక్షల్లో ఐదుగురు విద్యార్థులు హైటెక్ కాపీయింగ్కు పాల్పడి దొరికిపోయారు. వీరిపై హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఎలాగైనా ఐఐటీల్లో సీట్లు సంపాదించాలని ప్లాన్ చేసిన నిందితులు తొలుత వాట్సాప్ గ్రూప్ క్రియే ట్ చేసుకొన్నారు. ఆదివారం జరిగిన పరీక్షకు అందరూ స్మార్ట్ఫోన్లతో పరీక్షకు హాజరయ్యారు.
వీరిలో టాపర్ అయిన కడప జిల్లాకు చెందిన ఓ టీచర్ కుమారుడికి సికింద్రాబాద్లోని ఎస్వీఐటీ కాలేజీలో సెంటర్ పడగా అతడి సోదరుడైన మరో విద్యార్థికి మౌలాలిలో, మరో ఇద్దరు సోదరులకు మల్లాపూర్లో, ఇంకో విద్యార్థికి ఎల్బీనగర్లో సెంటర్ పడింది. సికింద్రాబాద్లో పరీక్ష రాస్తున్న విద్యార్థి వాట్సాప్ ద్వారా మిగతా నలుగురికి స మాధానాలు చేరవేశాడు. మల్లాపూర్లో పరీక్ష రా స్తున్న విద్యార్థిపై అనుమానంతో ఇన్విజిలేటర్ త నిఖీ చేయగా స్మార్ట్ఫోన్ బయటపడింది. అదే కేం ద్రంలో అతడి సోదరుడూ స్మార్ట్ఫోన్తో పట్టుబడ్డాడు. సికింద్రాబాద్ నుంచి సమాధానాలు వస్తున్నట్టు వారు చెప్పడంతో అక్కడి విద్యార్థిని తనిఖీ చేయగా ఫోన్ బయటపడింది. మౌలాలి, ఎల్బీనగర్లో పరీక్ష రాస్తున్న ఇద్దరి వద్ద ఫోన్లు లభించాయి. కాపీయింగ్పై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు పరీక్ష కేంద్రంలోకి స్మార్ట్ఫోన్లు ఎలా వెళ్లాయన్నదానిపై దర్యాప్తు ప్రారంభించారు.