కరీంనగర్ కలెక్టరేట్, మార్చి 6 : పల్లె ప్రకృతి వనాన్ని ధ్వంసం చేసిన ఘటనలో ఓ మాజీ ఎంపీటీసీకీ రూ.ఐదు లక్షల జరిమానా విధించారు. ఈ మేరకు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ రేణికుంట చిన్న రాయుడు భోగంపాడు, సిరిసేడు గ్రామంలో ఉపాధి హామీ నిధులతో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని ధ్వంసం చేశారు. దీనిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఎంపీడీవో విచారణ జరిపారు. విచారణలో పల్లెప్రకృతి వనం ధ్వంసం చేయడం నిజమేనని తేలడంతో నివేదికను కలెక్టర్కు పంపించారు. కలెక్టర్ పరిశీలించి వాల్టా చట్టం ప్రకారం రూ.ఐదు లక్షల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో ఆర్ఆర్ యాక్టు ప్రకారం తదుపరి చర్యలు తీసకుంటామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.