Jangaon | జనగామ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదు, బంగారు, వెండి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు.
తాజాగా జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కొమ్మల టోల్ప్లాజా వద్ద నిన్న తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓ కారులో తరలిస్తున్న 5.4 కిలోల బంగారాన్ని పోలీసులు సీజ్ చేశారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ. 3.09 కోట్లు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. సరైన పత్రాలు చూపించనందునే బంగారాన్ని సీజ్ చేశామని పోలీసులు తెలిపారు.