హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుంచి 28 వరకు హెచ్ఐసీసీలో నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక బయోఏషియా 21వ సదస్సులో తొలిసారి 5 దిగ్గజ కంపెనీలు భాగస్వామ్యమవుతున్నాయి.
ఈ సదస్సుకు హోస్ట్లుగా వ్యవహరించేందుకు నోవార్టిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బ్రిస్టల్ మేయర్స్ స్కిబ్, లారస్ ల్యాబ్స్, సాయి లైఫ్సైన్సెస్ కంపెనీలు ముందుకొచ్చినట్టు నిర్వాహకులు వెల్లడించారు. లైఫ్సైన్సెస్ రంగంలో భారత్ను, తెలంగాణను ప్రపంచ కేంద్రంగా నిలబట్టే లక్ష్యంతో ఈసారి బయోఏషియా సదస్సు జరగనున్నది.