నార్కట్పల్లి, ఏప్రిల్ 26 : నల్లగొండ జిల్లావ్యాప్తంగా పట్టుబడిన రూ.5.10 కోట్ల విలువైన 2,043 కిలోల గంజాయికి పోలీసులు నిప్పు పెట్టారు. పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 39 కేసుల్లో దీన్ని స్వాధీనం చేసుకున్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు దాన్ని శుక్రవారం నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం గుమ్మల్లబావి పోలీస్ ఫైరింగ్ రేంజ్ వద్ద ఎస్పీ, డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో కాల్చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ చందనా దీప్తి మాట్లాడుతూ.. గంజాయిని రవాణా చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.