హైదరాబాద్, జూన్29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 485 కరోనా కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 27,130 మందికి పరీక్షలు నిర్వహించారు. 485 మంది కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్న 4,421 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. బుధవారం 236 మంది కరోనా నుంచి కోలుకొన్నారు. రికవరీ రేటు 98.93 శాతంగా ఉన్నదని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొన్నది.
సతీశ్ధావన్ అంతరిక్ష కేంద్రంలో కొవిడ్!
శ్రీహరికోటలోని సతీశ్ధావన్ అంతరిక్ష కేంద్రంలో కొవిడ్ కలకలం రేపుతున్నది. ఐదుగురు ఉన్నతాధికారులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం వారు హోంఐసోలేషన్లో ఉన్నారు. కాగా గురువారం సాయంత్రం 6 గంటలకు పీఎస్ఎల్వీ-53 సీ ప్రయోగం జరగాల్సి ఉన్నది. ఈ క్రమంలో కరోనా కేసులు బయటపడటంతో ఇతర అధికారులు కలవరపాటుకు గురవుతున్నారు.