హైదరాబాద్ : దోస్త్ మూడో విడుత కౌన్సెలింగ్లో 42,468 మంది విద్యార్థులకు సోమవారం సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబర్ 4వ తేదీలోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి, కళాశాలల్లో చేరాలని దోస్త్ కన్వీనర్ లింబ్రాది సూచించారు. కౌన్సెలింగ్లో భాగంగా అక్టోబర్ 5 నుంచి ఇంట్రా కాలేజ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు లింబాద్రి పేర్కొన్నారు. 5 నుంచి 7 వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని, 8న సీట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. డిగ్రీ మొదటి సెమిస్టర్ తరగతులు అక్టోబర్ 1 నుంచి ప్రారంభమవుతాయని కన్వీనర్ వివరించారు.