హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 4 ఆర్వోబీ(రైల్వే ఓవర్ బ్రిడ్జి) ల నిర్మాణానికి రూ. 404.82 కోట్లతో ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈ నాలుగు ఆర్వోబీల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 250.02 కోట్లు, రైల్వేశాఖ రూ. 154.80 కోట్లు భరించనుంది. ఈ ఆర్వోబీలను రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి ప్రశాంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
షాద్నగర్ చటాన్పల్లి వద్ద నిర్మించే ఆర్వోబీకి రూ. 95 కోట్లు, ఆదిలాబాద్ యార్డ్ ఆర్వోబీకి రూ. 97.20 కోట్లు, పెద్దపల్లిలో ఆర్వోబీకి రూ. 119.50 కోట్లు, నిజామాబాద్ మాధవనగర్లో నిర్మించే ఆర్వోబీకి రూ. 93.12 కోట్లు కేటాయించారు.