పాలకుర్తి : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు తరాలకు చెందిన.. 400 మంది ‘తాటిపాముల’ ఇంటిపేరు కలిగిన కుటుంబ సభ్యులు ఒక్కచోట కలిశారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా శాలపల్లిలో నిర్వహించిన తాటిపాములవారి ఆత్మీయ సమ్మేళనంలో వారందరూ పాల్గొని పరస్పరం యోగక్షేమాలు తెలుసుకున్నారు.
ఆటపాటలతో సందడి చేశారు. సామూహిక విందును ఆరగించారు. కుటుంబీకుల్లో పెద్దమనుషుల దంపతులను ఘనంగా సత్కరించుకున్నారు. ఇందులో నిర్వాహకులు తాటిపాముల తిరుమల్, రమేశ్, కిషన్, తిరుపతి, సమ్మయ్య తదితరులు ఉన్నారు.