హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పుడున్న టిమ్స్ దవాఖానను ప్రజా అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసి, దాన్ని సూపర్ స్పెషాలిటీ దవాఖానగా అధునీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి తోడు మరో మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
వీటిలో చెస్ట్ ఆస్పత్రి ప్రాంగణంలో ఒకటి, ఈ మధ్యనే గడ్డి అన్నారం నుంచి షిప్టు చేసిన ప్రూట్ మార్కెట్ ప్రాంగణంలో రెండోది, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అల్వాల్ నుంచి ఓఆర్ఆర్ మధ్యలో మూడో దాన్ని, ఇక ప్రస్తుతమున్న టిమ్స్ ను కలిపి మొత్తం నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది. కొత్తపేటలో ప్రస్తుతం ఉన్న కూరగాయల మార్కెట్ ను పూర్తిగా ఆధునీకరించి ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ గా మార్చాలని కేబినెట్ నిర్ణయించింది.