హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 31 (నమస్తే తెలంగాణ): ఏసీబీ డీజీ సీ వీ ఆనంద్ పేరుతో సోషల్ మీడియాలో పదే పదే నకిలీ ఖాతాలు పుట్టుకొస్తున్నా యి. దీనిపై ఇప్పటికే సీసీఎస్ సైబర్క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో ఏసీపీ చాంద్పాషా నేతృత్వంలోని దర్యాప్తు బృందం ఇటీవల ఫేస్బుక్ నుంచి 2 నకి లీ ఖాతాలను తొలగించింది. ఈ కేసు విచారణ క్రమంలో మరో 4 నకిలీ ఖా తాలు బయటపడ్డాయి.
వీటిలోని ఓ ఖా తాలో డబ్బులు కావాలంటూ సైబర్ నేరగాళ్లు పెట్టిన మెసేజ్కు ఓ అమాయకుడు స్పందించి రూ.80 వేలు డిపాజిట్ చేసినట్టు వెలుగులోకి వచ్చింది. ప్రముఖులు, పోలీస్ ఉన్నతాధికారుల పేర్లతో రాజస్థాన్, జార్ఖండ్, బీహార్ రాష్ర్టాల్లోని సైబర్ నేరగాళ్లు ఫేస్బుక్లో నకిలీ ఖాతా లు తెరిచి అత్యవసరంగా డబ్బు కావాలని మెసేజ్లు పెడుతున్నట్టు తెలిసింది. సోషల్ మీడియాలో ఎవరైనా ప్రముఖు ల పేరిట డబ్బు కావాలని అడిగితే అవి నకిలీవిగా గుర్తించాలని సూచిస్తున్నారు.