Mahabubabad | మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం( Bayyaram ) మండల పరిధిలో మావోయిస్టుల( Maoists ) పేరుతో కొంతమంది డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. డిమాండ్ చేసిన డబ్బు ఇవ్వకపోతే కిడ్నాప్లకు పాల్పడుతున్నారు. దీంతో బాధిత వ్యక్తులు పోలీసులకు( Police ) సమాచారం అందించారు. ఈ క్రమంలో అంతర్ జిల్లాకు చెందిన నలుగురు సభ్యుల నకిలీ నక్సల్స్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాకు సంబంధించిన వివరాలను డీఎస్పీ రమణబాబు( DSP Ramanababu ) మీడియాకు వెల్లడించారు.
ఈ ముఠా సభ్యుల నుంచి ఒక ఎయిర్ పిస్టల్, రూ. 1. 20 లక్షల నగదు, 4 సెల్ఫోన్లు, 2 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులంతా గతంలో ప్రజా ప్రతిఘటన విప్లవ గ్రూపుల్లో పని చేసిన వారేనని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినంగా శిక్షిస్తామని డీఎస్పీ హెచ్చరించారు.