మానకొండూర్ రూరల్, ఫిబ్రవరి 16 : కాకతీయ కాలువకు అనుబంధంగా ఉన్న కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం పచ్చునూర్ గ్రామ శివారులోని 4 ఎల్ కెనాల్కు గురువారం గండిపడింది. దీంతో
నీరు వృథాగా పోవడంతోపాటు నీటి ప్రవాహంతో దాదాపు 25 ఎకరాల్లో పంట పొలాలు సైతం దెబ్బతిన్నాయి. ఇరిగేషన్ అధికారులు శుక్రవారం ఘటనా స్థలానికి చేరుకొని మరమ్మతులు చేపట్టారు.