చేర్యాల, మార్చి 22: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారికి బంగారు కిరీటాన్ని తయారు చేయిస్తున్నట్టు ఆర్థ్ధికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో దేవాదాయశాఖ వరంగల్ జోన్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్రావు, ఆలయ ఈవో బాలాజీతో కలిసి కోరమీసాల స్వామివారికి చేయించే స్వర్ణకిరీటం నమూనాను వారు ఆవిష్కరించారు. రూ.4 కోట్లతో ఆరున్నర కిలోల బంగారు కిరీటాన్ని ప్రభుత్వ పక్షాన తయారు చేయిస్తున్నట్టు మంత్రులు పేర్కొన్నారు. కిరీటం తయారీ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. వచ్చే రెండు నెలల్లో స్వామి వారికి బంగారు కిరీటం సమర్పిస్తామని వారు స్పష్టం చేశారు.