Telangana | హైదరాబాద్ : పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలోని కొత్త జిల్లాల్లో కొత్తగా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మరో నాలుగు జిల్లాల కలెక్టరేట్లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. జూన 4వ తేదీన నిర్మల్, 6న నాగర్కర్నూల్, 9న మంచిర్యాల, జూన్ 12వ తేదీన గద్వాల జిల్లా కలెక్టరేట్లను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నాలుగు జిల్లాల కలెక్టరేట్ల పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇప్పటికే చాలా జిల్లాలకు సంబంధించిన కొత్త కలెక్టరేట్లు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.