హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, ప్రముఖ సంఘ సేవకురాలు సావిత్రిబాయి పూలే 192వ జయంతి ఉత్సవాన్ని ఈ నెల 3న రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించనున్నారు.
బీసీ మహిళా సంఘం ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి బీసీ మంత్రులు, ఎంపీలు, ఐఏఎస్లు, మహిళా చైర్పర్సన్లు ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నట్టు ఉత్సవాల నిర్వాహక కమిటీ చైర్పర్సన్ మణిమంజరి సాగర్ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రజల అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.