హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వ్యాప్తంగా శనివారం అన్ని స్థాయి కోర్టుల్లో నిర్వహించిన లోక్అదాలత్లకు అనూహ్య స్పందన లభించింది. పలు వివాదాల్లో ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి రావడంతో లబ్ధిదారులకు రూ.320 కోట్ల మేరకు అవార్డుగా చెల్లింపులకు ఉత్తర్వులు వెలువడ్డాయి.
హైకోర్టు, జిల్లా కోర్టులు, ఇతర కోర్టుల్లో 39,24,107 కేసులు పరిషారం అయ్యాయి. వాటిలో ప్రీలిటిగేషన్ కేసులు 32,65,220, పెండింగ్ కేసులు 6,58,887 చొప్పున ఉన్నాయి. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, న్యాయమూర్తులు జస్టిస్ పీ శ్యామ్ కోస్టి, జస్టిస్ టీ వినోద్కుమార్ పర్యవేక్షణలో లోక్అదాలత్ల నిర్వహణ జరిగినట్టు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎస్ గోవర్ధన్రెడ్డి తెలిపారు.