SCR | హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే జోన్, సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ పరిధిలో కలిపి మొత్తం 36 రైలు సర్వీసును రద్దు చేస్తూ సోమవారం రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. చామరాజానగర్ – తిరుపతి, చెన్నై- తిరుపతి రైల్వే స్టేషన్ల మధ్య 12 రైళ్లు, సికింద్రాబాద్ – పాట్నా, వాస్కోడిగామా – జసిదీ, ధన్పూర్ – బెంగళూర్, చెన్నై- లక్నో, నిజామూద్దీన్ – చెన్నై, గోరఖ్పూర్ – యశ్వంత్పూర్తో పాటు పలు రైల్వే స్టేషన్ల పరిధిలో 20 సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపారు.
అలాగే మరో 12 రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే దండ్-నిజామాబాద్, నిజామాబాద్-పందాపూర్, నిజామాబాద్-పుణె మధ్యలో నాలుగు సర్వీసులు ఈ నెల 11 నుంచి 30 వరకు రద్దు చేశామన్నారు. అలాగే 20 రైళ్లను ఈ నెల 14, 16, 20, 22, 23, 25, 27 వరకు సర్వీసుల వారీగా రద్దు చేసినట్లు తెలిపారు.